Homebreaking updates newsBonalu: తెలంగాణలో బోనాల జాతర షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

Bonalu: తెలంగాణలో బోనాల జాతర షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్. మంగళ వాయిద్యాలతో పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేథ్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకునే సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆషాఢమాసం ముగిసే వరకు గురు, ఆదివారాల్లో బోనాలను సమర్పించనున్నారు భక్తులు. కుతుబ్‌ షాహీల కాలం నుండి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీరసారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, లాల్ దర్వాజ అమ్మవార్లకు కూడా బోనాలు సమర్పించనున్నారు.

ఇక బోనాల సంబురాల పూర్తి షెడ్యూల్ ఇలా..
జూన్ 26: గోల్కొండ అమ్మవారికి తొలి బోనం
జూన్ 29: విజయవాడ కనకదుర్గ దేవికి 2వ బోనం
జులై 3: బల్కంపేట ఎల్లమ్మకు 3వ బోనం
జులై 6: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బోనం
జులై10: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి 5వ బోనం
జులై 13: సికింద్రాబాద్ లో బోనాల జాతర
జులై 14: రంగం, అంబారిపై అమ్మవారి ఘటం ఊరేగింపు
జులై 15: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం
జులై 17: లాల్ దర్వాజా సింహవాహిని దేవికి చివరి బోనం
జులై 20: పాతబస్తీ, లాల్ దర్వాజా బోనాల జాతర
జులై 21: పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు

భాగ్యనగర బోనాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోనూ బోనాల జాతర జరుగుతుంది. నెల రోజుల పాటు జరిగే ఈ సంబురాలు లాల్ దర్వాజ ఆలయంలో జరిగే రంగం వేడుకతో ముగియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments