భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ రూ.2,91,191 కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75577 కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖా మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు ఇలా కేటాయింపులు జరిపారు.
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-రూ.72,659 కోట్లు
హార్టికల్చర్-రూ.737 కోట్లు
పశుసంవర్ధక శాఖ-రూ.19080 కోట్లు
మహాలక్ష్మి ఉచిర రవాణా-రూ.723కోట్లు
గృహజ్యోతి-రూ.2418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ-రూ.3836 కోట్లు
పంచాయతీ రాజ్-రూ.29816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ -రూ.50 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి-రూ.10,000 కోట్లు
జీహెఎంసీ-రూ.3000 కోట్లు
హెచ్ ఎండీఏ-రూ.500 కోట్లు
మెట్రో వాటర్-రూ.3385 కోట్లు
హైడ్రా-రూ.200 కోట్లు
ఏయిర్పోట్ కు మెట్రో-రూ.100 కోట్లు
ఓఆర్ ఆర్ -రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో-రూ.500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో-రూ.500 కోట్లు
మూసీ అభివృద్ధి-రూ.1500 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు-రూ.1500 కోట్లు
స్ర్తీ ,శాశు -రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-రూ.17000 కోట్లు
మైనారిటీ సంక్షేమం-రూ.3000 కోట్లు
బీసీ సంక్షేమం-రూ.9200 కోట్లు
వైద్య ఆరోగ్యం-రూ.11468 కోట్లు
విద్యుత్-రూ.16410 కోట్లు
అడవులు ,పర్యావరణం-రూ.1064 కోట్లు
ఐటి-రూ.774 కోట్లు
నీటి పారుదల -రూ.22301 కోట్లు
విద్య-రూ.21292 కోట్లు
హోంశాఖ-రూ.9564 కోట్లు
ఆర్ అండ్ బి-రూ.5790 కోట్లు
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ 3385 కోట్లు
హైడ్రాకి 200 కోట్లు
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు
బీసీ సంక్షేమం 9200 కోట్లు
మైనార్టీ శాఖకు 3003 కోట్లు
ఎస్సి సంక్షేమం 33124కోట్లు
ఎస్టీ 17056 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు
త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు కేటాయింపులు జరిపారు.
నీటి పారుదల శాఖకి 22,301 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించారు.
బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లిందన్నారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందన్నారు. దళితబంధు పథకం ప్రస్తావనే లేదన్నారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారన్నారు.
ఒత్తిపలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.