Homemain slidesప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోంది.. హరిష్ రావు

ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోంది.. హరిష్ రావు

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్స్ పై శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చే దసరా, దీపావళి కానుక అంటూ దుయ్యబట్టారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడ ఉన్న రేవంత్ రెడ్డి టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టిఏ ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించింది. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్ కు 25,000 పట్టణానికి 50,000 హైదరాబాదులో అయితే 75,000 ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వాణ కోసం నిధులు విడుదల చేయడం లేదన్నారు. దీని వలన పోలీసులు, పోలీస్ స్టేషన్ కు వెళ్లే ప్రజలపై భారం పడుతుందన్నారు. ఈ నిధుల విడుదల కోసం సిఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..సీఎం

RELATED ARTICLES

Most Popular

Recent Comments