Homemain slidesవాళ్ల మాటలు అలా.. వీళ్ల మాటలు ఇలా

వాళ్ల మాటలు అలా.. వీళ్ల మాటలు ఇలా

భారత్ సమాచార్,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క శాఖను సమీక్షిస్తూ ముందుకెళ్తోంది. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రయాణిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దానిలో పేర్కొంది. రూ.6.71లక్షల అప్పు చేసిందని తెలిపింది.

ఈ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. దానికి హరీశ్ రావు లేచి.. ‘‘మా చేతిలో 42 పేజీల బుక్ లెట్ పెట్టి.. ఇప్పటిదిప్పుడు మాట్లాడమంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. మాకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వరా అన్నారు. దాన్ని చదవకుండానే మేమేలా మా వాయిస్ వినిపిస్తాం అన్నారు.

ఇక దీనికి స్పందనగా మంత్రి శ్రీధర్ బాబు సౌమ్యంగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు కోరినట్టుగా టీ బ్రేక్ లో కొంత సమయం ఇస్తామన్నారు. వారు ప్రిపేర్ అయిన తర్వాతే మాట్లాడవచ్చు అని చెప్పారు.

ఇలాంటి ఘటనలు..మనకు గతంలో కూడా కనపడ్డాయి. గతంలో సేమ్ ఇలాంటి సిట్యూయేషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘‘తాము ప్రిపేర్ అయ్యి రాకుండా ఎలా మాట్లాడుతాం? మా కొంచెం సమయం ఇవ్వాలి ’’ అని స్పీకర్ ను కోరుతారు. దీనిపై అప్పటి సీఎం కేసీఆర్ తర్వాత జరిగిన ఓ సభలో పరుషపదజాలంతో కాంగ్రెస్ నేతలను కించపరుస్తూ ‘‘ ప్రిపేర్ కానిదే సభకు ఎందుకు వచ్చారు. పీకనీకి వచ్చిండ్రా.. లేదంటే గోళీలు ఆడేందుకు వచ్చిండ్రా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పై రెండు ఘటనలను మిక్స్ చేసి కాంగ్రెస్ సోషల్ మీడియా ఓ వీడియోను తెగ వైరల్ చేస్తోంది. అందులో భట్టి, కేసీఆర్ ల వీడియో.. హరీశ్ రావు, శ్రీధర్ బాబు వీడియోలను పెట్టి బీఆర్ఎస్ వాళ్లవి బలుపు మాటలు, కాంగ్రెస్ నేతలవి మర్యాద మాటలు అంటూ వీడియో పోస్టు చేశారు.

మరికొన్నికథనాలు…

ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

Recent Comments