Homemain slidesఆ గ్రామాలకి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు

ఆ గ్రామాలకి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు

భారత్ సమాచార్, జాతీయం ;

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్యనున్న వివాదాస్పద  కొఠియా గ్రామాలు వార్తల్లో నిలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉండటంతో ఈ గ్రామం వార్తలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు రెండు చోట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం నేరడివలసలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.

ఇక్కడి 21 గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్నాయి. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే కొన్ని దశాబ్దాలుగా రెండేసి ఓట్లు వేస్తున్నారు ఈ గ్రామస్తులు. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితిలో కొఠియా పంచాయతీ ఉంది. ఈ ప్రాంతం ఒడిశా రికార్డుల్లో, ఆంధ్రాలోని మన్యం జిల్లా సాలూరు మండలం రికార్డుల్లోనూ ఉంది.

నాడు బ్రిటిష్‌ వారు చేసిన తప్పు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్నాయి. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉండటం విశేషం. 1996లో మధ్యంతర ఎన్నికల సమయంలో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేరోజు ఎన్నికలు జరగ్గా, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్ల పరస్పర చర్చలతో వేరే ఇంకులు ఉపయోగించడంతో గిరిజనులు రెండుచోట్ల ఓటు వేశారు. మళ్లీ ఇప్పుడు ఒకేరోజు పోలింగ్‌ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒడిశా అధికారులు ఆ గ్రామాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఒడిశాలో గతంలో మాదిరి ఎక్కువ పోలింగ్‌ శాతం జరిగేలా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ 21 గ్రామాల గిరిజనులకు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలుంటారు. ఒడిశాలో కొరాపుట్‌ లోక్‌సభ, పొట్టంగి అసెంబ్లీ సెగ్మెంట్‌, ఆంధ్రాలోని అరకు లోక్‌సభతోపాటు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొఠియా గ్రామాలున్నాయి. అరకు లోక్‌సభ స్థానం నుంచి 13 మంది, సాలూరు ఎమ్మెల్యే స్థానానికి ముగ్గురు, కొరాపుట్‌ లోక్‌సభ స్థానం నుంచి 10 మంది, పొట్టంగి నియోజకవర్గంలో 9 మంది పోటీ చేస్తున్నారు. ఆంధ్రా నుంచి 2,554 మంది ఓటర్ల కోసం నేరేడివలస, శిఖపరుపు, కుర్‌కుటిల్లో, ఒడిశా నుంచి 5,502 మంది ఓటర్ల కోసం కొఠియా, గంజాయి పొద్రొ, పట్టు చెన్నేరు, మద్కర్‌, నేరేడి వలస, రణసింగ్‌, టౌపొద్ర, గల్లిగబ్దర్‌, గేమెల్‌ పోద్రొల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉదయం ఒడిశాలో.. మధ్యాహ్నం ఆంధ్రాలో

ప్రతి ఎన్నికల్లోనూ రెండు రాష్ట్రాల పోలింగ్‌లో పాల్గొంటామని ఓటర్లు చెబుతున్నారు. ఉదయం ఒడిశాలో, మధ్యాహ్నం ఆంధ్రాలో ఓట్లు వేస్తామని చెప్పారు. తరతరాలు నుంచి ఈ విధానం కొనసాగిస్తున్నామని, ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని అంటున్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

జోరుగా… హుషారుగా సాగుతున్న పోలింగ్

RELATED ARTICLES

Most Popular