Homemain slidesచరిత్రలో ఈరోజు నవంబర్-1 

చరిత్రలో ఈరోజు నవంబర్-1 

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;             

నేటి ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము.

కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.

గర్వాల్ రైఫిల్ దినం.

ప్రముఖుల జననాలు

1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి.

1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత.

1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి.

1944: వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే.

1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.

1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, నటి,

1974: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.

1987: ఇలియానా, తెలుగు సినిమా నటీమణి.

ప్రముఖుల మరణాలు

1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.

1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. ‌‌

చరిత్రలో ప్రముఖ సంఘటనలు

అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో ‘ఎనెవెటాక్’ వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.

1956: బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు).

1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.

1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.

1983: ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావునియమితులయ్యారు.

2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు అక్టోబర్ -31

RELATED ARTICLES

Most Popular

Recent Comments