భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
ప్రముఖుల జననాలు
1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి.
1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు.
1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు.
1952: వేదగిరి రాంబాబు, రచయిత
1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
ప్రముఖుల మరణాలు
1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు.
1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి.
2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు.
2011: జాలాది రాజారావు, తెలుగు రచయిత.
2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు.
2020: శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
చారిత్రక సంఘటనలు
1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు
1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.
1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
1998: అమర్త్యసేన్కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతివచ్చింది.