Homemain slidesచరిత్రలో ఈ రోజు అక్టోబర్ 14

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 14

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రముఖుల జననాలు

1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి.

1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు.

1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు.

1952: వేదగిరి రాంబాబు, రచయిత

1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

ప్రముఖుల మరణాలు

1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు.

1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి.

2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు.

2011: జాలాది రాజారావు, తెలుగు రచయిత.

2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు.

2020: శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత.

చారిత్రక సంఘటనలు

1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు

1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.

1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం.

1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.

1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.

1998: అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతివచ్చింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 12

 

‌‌

RELATED ARTICLES

Most Popular

Recent Comments