భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
చరిత్రలో ప్రముఖ సంఘటనలు
1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
ప్రముఖుల జననాలు
1864: ఆచంట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు.
1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత
1916: వడ్డూరి అచ్యుతరామ కవి, తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పురాణ ప్రవచకుడు.
1917: ఎస్.ఎస్.శ్రీఖండే, భారతీయ గణిత శాస్త్రవేత్త.
1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.
1929 : గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే జననం .
1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి, శతకకారుడు.
1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు
ప్రముఖుల మరణాలు
1937: ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు.
1986: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి .
1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభను నడిపించిన సంపాదకుడు .
1991: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు .
2006: శ్రీవిద్య, చలనచిత్ర నటి, గాయని.
2013: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత
2015: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు .