Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్ -31

చరిత్రలో ఈరోజు అక్టోబర్ -31

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

-ఏక్తా దివస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.

ఇందిరాగాంధీ వర్ధంతి.

జాతీయ ఐక్యతా దినోత్సవం

హాలోవీన్ (Hallowe’en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.

క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు…మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

ప్రముఖుల జననాలు

1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి.

1889: ఆచార్య నరేంద్ర దేవ్.

1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు.

1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత.

1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.

1943: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి

1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు.

ప్రముఖుల మరణాలు

1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది “వికట కవిత్వం” అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు.

1975 : భారతీయ సంగీత కారుడు, ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ మరణం .

1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి.

1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగ నేపథ్యగాయని.

2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత.

2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని.

2019: గీతాంజలి తెలుగు సినిమా నటి.

2022: జేజే ఇరానీ, భారతీయ పారిశ్రామికవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.

2023: ఈశ్వరరావు, తెలుగు చలన చిత్ర నటుడు, టీ వీ.సీరియల్ నటుడు.

చరిత్రలోని ప్రముఖ సంఘటనలు

1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు.

2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈ రోజు అక్టోబర్-30

 

RELATED ARTICLES

Most Popular