భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: ఆరుగ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో విద్య, మెరుగైన వైద్యానికి పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విషయం విదితమే. కానీ మెరుగైన వైద్యం అందించడం దేవుడెరుగు కానీ కనీసం ఆస్పత్రుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు కరెంట్ కోతలు లేవంటున్న ప్రభుత్వ పెద్దలకు మరొవైపు విద్యుత్ అంతరాయం ఏర్పడడం కన్పించడం లేదా అని ప్రజలు వాపోతున్నారు. కరెంట్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మారడం లేదు. గత బీఆర్ఎస్ హయంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మారినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం ఉన్నా దానిని వినియోగించకుండా ఆస్పత్రి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చీకట్లోనే వైద్యం అందిస్తున్నారు.
పేరుకే జిల్లా ఆస్పత్రి:
మూడు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రోగులు ఎంతఇబ్బంది పడ్డారో మనందరికి తెలిసిందే. తాజాగా భువనగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఇదే జరిగింది. బుధవారం రాత్రి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో వైద్యులు చీకట్లోనే వైద్యం చేశారు. పేరుకే జిల్లా ప్రభుత్వాసుపత్రి అయినా వసతులు లేవు, డాక్టర్లు అందుబాటులో ఉండరు, రోగులను వైద్య సిబ్బంది పట్టించుకోరు అన్న విమర్శ లేకపోలేదు. డాక్టర్లు అందరికీ ఆ చుట్టుపక్కలనే సొంత ప్రైవేట్ దవఖానాలు ఉండడంతో రోగులను పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని కథనాలు: