భారత్ సమాచార్.నెట్: భారత్ (India)తో పాటు ఇతర దేశాల్లోలో (Other Countries) ఐఫోన్ల (IPhones) తయారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలోనే స్థానికంగానే తయారు చేయాలని.. ఫోన్లు భారతదేశంలో కానీ మరే ఇతర దేశంలో తయారు చేస్తే 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్కు ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు చేశారు.
శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లకూ ఈ రూల్ వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదంటే.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇక్కడే ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవలన్నారు. అలా కాకుండా భారత్ ఇతర దేశంలో తయారు చేసిన ఫోన్లను అమెరికాలో దిగుమతి చేస్తే 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే సౌత్ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి ఏడాది 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇక్కడి నుంచే చాలా దేశాలకు ఫోన్స్ ఎగుమతి అవుతున్నాయి. శాంసంగ్ కూడా ఇతర దేశాల నుంచి ఫోన్స్ తీసుకొస్తే సుంకాలు చెల్లించక తప్పదు. ఇకపోతే ఐఫోన్ల తయారిని భారత్లో చేయవద్దని.. యాపిల్కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. భారత్లోనే ఐఫోన్ తయారీకి మొగ్గు చూపింది.