భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్(Pakistan)కు అనుకూలంగా వ్యవహరిస్తున్న టర్కీ (Turkey)కి భారత్ (India) నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘బాయ్కాట్ టర్కీ’ (Boycott Turkey) నినాదం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’ (Destination Wedding) ద్వారా ఆ దేశం ఆర్జించే ఆదాయం (Income)పై తీవ్రం ప్రభావం పడనుంది. ఈ పరిణామాల వల్ల టర్కీ దాదాపు 90 మిలియన్ డాలర్లకు పైగా అంటే 700 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొంతకాలంగా టర్కీ డెస్టినేషన్ వెడ్డింగ్కు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. టర్కీని డెస్టినేషన్ వెడ్డింగ్కు కేంద్రంగా ఎంచుకోవడానికి ముఖ్య కారణం.. టర్కీలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్లోని చారిత్రక రాజభవనాలు, అందమైన సముద్ర తీర ప్రాంతాలు ఉండటంతో పెళ్లి చేసుకునే జంటలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో 2018లో కేవలం 13 భారతీయ జంటలు టర్కీలో పెళ్లి చేసుకోగా.. గత ఏడాది నాటికి ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వల్ల ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున 140 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది. ఒక్కో వివాహానికి దాదాపుగా 3 మిలియన్ డాలర్ల పైనే ఖర్చు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.25 కోట్లు పైమాటే. ఇంకా గ్రాండ్గా చేసుకుంటే 8 మిలియన్ డాలర్లు (రూ.68 కోట్లు) వరకు ఖర్చ అవుతుంది. అంతేకాదు పెళ్లికి వచ్చే అతిథుల లోకల్ టూర్తో మరింత ఆదాయం సమకూరుతోంది. కాగా బాయ్కాట్ టర్కీ నిరసన మొదలు కావడంతో భారతీయ జంటలు వారి డెస్టినేషన్ వెడ్డింగ్ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంనది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.