భారత్ సమాచార్.నెట్: ఏపీ (Andhrapradesh)కి మరో వందేభారత్ (Vande Bharat) రానుంది. త్వరలో విజయవాడ (Vjaywada) నుంచి బెంగళూరు (Banglore) వరకు వందేభారత ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) సిద్ధమైంది. ఈ మార్గంలో రైలు ప్రయాణానికి తొమ్మిది గంటల సమయం పట్టనుంది. దీంతో ప్రయాణీకులకు మూడు గంటలు ఆదా కానుంది. విజయవాడ తిరుపతి మీదుగా బెంగళూరుకు త్వరలో వందేభారత్ ప్రారంభించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు కూడా ఈ వందేభారత్ సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ రైలు మొత్తం 8 బోగీలతో నడవనుంది. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలు దేరే ఈ రైలు.. 5 గంటల 39 నిమిషాలకు తెనాలి.. 6 గంటల 28 నిమిషాలకు ఒంగోలు.. 7 గంటల 43 నిమిషాలకు నెల్లూరు.. 9 గంటల 45 నిమిషాలకు తిరుపతి.. 10.27కు చిత్తూరు.. 11.13 కాట్పాడి.. 13.38 కృష్ణరాజపురం.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది.
అదే రోజు ఈ రైలు తిరుగు ప్రయాణంలో బెంగళూరులో 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరి.. 2 గంటల 58 నిమిషాలకు కృష్ణరాజపురం.. 5 గంటల 23 నిమిషాలకు కాట్పాడి.. 5 గంటల 49 నిమిషాలకు చిత్తూరు.. 6 గంటల 55 నిమిషాలకు తిరుపతి.. 8 గంటల 18 నిమిషాలకు నెల్లూరు.. 9 గంటల 29 నిమిషాలకు ఒంగోలు.. రాత్రి 10 గంటల 42 నిమిషాలకు తెనాలి.. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు విజయవాడకు చేరుకోనుంది. కాగా, ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వారానికి మూడు రోజులు మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడు ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది.