Homemain slidesబాబాయ్ కోసం మెగా ప్రిన్స్ ప్రచారం

బాబాయ్ కోసం మెగా ప్రిన్స్ ప్రచారం

భారత్ సమాచార్, పిఠాపురం ; టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జనసేన అధినేత, ఆయన బాబాయ్ పవణ్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ తదితర గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని నాయకుడు పవన్ కళ్యాణ్. డబ్బు గురించి ఆలోచించని ప్రజా నాయకుడు ఆయన. ప్రజలకు ఏదో మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు జనసేన అధినేత ’’ అని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు.

మరి అలాంటి నాయకుడిని పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపితే మనందరి కోసం మరెంతో మంచి పనులు చేస్తారన్నారు. మరో రెండు వారాల్లో ఎన్నికల పోలింగ్ ఉండబోతోందన్నారు. మీ అందరి ఆశ్వీర్వాదంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. “బాబాయ్ పవన్ కల్యాణ్ పదేళ్లుగా జనానికి మంచి చేయాలన్న తపనతో రాజకీయాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో మాటలుపడ్డారు. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయకుండా నిలబడ్డారు. కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. మత్స్యకారుల కోసం నిలబడ్డారు. రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ పోరాటం చేశారు. ప్రజలందర్నీ సొంత కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్ , మీ కోసం పండుగల సమయంలో కూడా మా కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ప్రతి ఒక్క ఓటరుకి మా తరపున చేస్తున్న విన్నపం ఒక్కటే, ప్రజల కోసం పోరాటం చేసే జనసేన నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇక మీదట ఎవరు అడిగినా బాబాయ్ పోటీ చేస్తున్న పిఠాపురమే మా ఊరు అని చెబుతాం. ఏ పండుగ వచ్చినా మా సొంతూరు పిఠాపురంకు వచ్చి జరుపుకుంటాం. మే 13వ తేదీన ప్రతి ఓటరు గుర్తు పెట్టుకుని అసెంబ్లీ ఓటును పవన్ కళ్యాణ్ కి, పార్లమెంటు ఓటును ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తు మీద వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి” అని అన్నారు.

పిఠాపురం నుంచి జనసైనికుల అపూర్వ స్వాగతం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి పిఠాపురం గ్రామీణ ప్రజలు అడుగడుగునా అద్భుత స్వాగతం పలికారు. తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ గ్రామాల్లో ప్రజలంతా జనసేన నినాదాలతో హోరెత్తించారు.
వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఆధ్యంతం జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజల హర్షాతిరేకల మధ్య ప్రతి ఒక్కరికీ గాజు గ్లాసు గుర్తును చూపుతూ, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని వరుణ్ తేజ్ ఓటర్లను అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వరుణ్ తేజ్ ధన్యవాదాలు తెలిపారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

వైసీపీ నవరత్నాలు+ మేనిఫెస్టో విడుదల…

RELATED ARTICLES

Most Popular

Recent Comments