భారత్ సమాచార్, హైదరాబాద్ ;
ప్రస్తుతం తెలంగాణ ప్రజల అటెన్షన్ మొత్తం ‘హైడ్రా’ చుట్టూనే తిరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ‘హైడ్రా’ కూల్చివేత్తలను నిశితంగా గమనిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘హైడ్రా’ కూల్చివేత్తలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు చేశారు.
ఒకటా రెండా నగరం లో నీ 1,500,000,000,000 కోట్ల మూసి ధన దాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీప్ మినిష్టర్ అంటూ మండిపడ్డారు. నగరం రోదిస్తోంది…కళ్లు చెదిరి, గుండెలు పగిలి,..ఆడబిడ్డల అవేదనలు..ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోదిస్తోందని కేటీఆర్ రాసుకొచ్చారు. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి, కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని ఒక తల్లి…అమ్మఒడి లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతాం అంటూ మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారన్నారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి రోదన ఒక వైపు, భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త వేదనతో భాగ్యనగరం మండుతోందన్నారు.
‘‘నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయం లో 20 కార్లతో రైతులను రెచ్చగోడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి.. ఇప్పుడు ఎక్కడ పన్నావ్ ’’ అంటూ ట్వీట్ చేశారు. నాడు ఆలా నేడు ఇలా, నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావ్ అని మరోమారు నిరూపించావని విమర్శించారు. మహా నగర ప్రజలారా మీరు అధైర్య పడొద్దు ఇప్పుడు జరుగుతున్న ఈ విద్వంసంలో తొందరపడి మీ ప్రాణాలను బలితీసుకోవద్దు న్యాయ స్థానాలు ఉన్నాయి. మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.