భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) గతేడాది ఇరు కుటుంబ సభ్యులు అంగీకారంతో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్థూడియో (Annapoorna Studios)లో అక్కినేని నాగేశ్వర్ రావు ఆశీసులతో వీరి వివాహం జరిగింది. అయితే వీరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తులు చొక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత టీమ్ (Sobita) ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
శోభిత ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తేల్చింది. ప్రస్తుతం శోభిత తన మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది శోభిత టీమ్. అయితే ‘వేవ్స్ 2025’ సమ్మిట్లో శోభిత చీర కట్టుకొని కనిపించడంతో ఈ రూమర్స్కు బలం చేకూర్చినట్లుగా అయింది. బేబీ బంప్ కవర్ చేయడానికి చీరను ఎంచుకున్నట్లు చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆమె టీమ్ క్లారిటీ ఇవ్వడంతో.. ఈ రూమర్లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాల్లో మెరిసింది. శోభిత మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్లో కూడా సత్తా చాటింది.
కాగా గతేడాది డిసెంబర్లో నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో టచ్లో ఉంటోందీ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అందులో పంచుకుంటోంది. ఇక నాగ చైతన్యం మాత్రం పెళ్లి తర్వాత తండేల్ మూవీలో నటించగా.. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఆ సినిమా నిలచింది. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.