భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Hasan) ప్రధాన పాత్రలో.. మణిరత్నం (Maniratna) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూన్ 5న విడుదల కానున్న ఈ సినిమా.. ఆడియో ఈవెంట్ (Audio Event)ను మేకర్స్ గ్రాండ్గా నిర్వహించాలని భావించారు. మే 16న ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించిన మేకర్స్.. తాజాగా ఆ ఈవెంటన్ వాయిదా వేశారు.
ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో థగ్ లైఫ్ ఆడియో కార్యక్రమం జరపడం సరికాదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు.. ‘మాతృభూమి పరిరక్షణలో సైనికులు పోరాటం చేస్తున్న సమయంలో.. వేడుకలకు ఇది తగిన సమయం కాదు. మేము దేశ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. సైనికులకు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందుకే మే 16న జరగాల్సిన ఆడియో రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని కమల్హాసన్ పేర్కొన్నారు.
ఇకపోతే ఈ చిత్రం ‘నాయకన్’ (1987) తర్వాత మళ్లీ కమల్ హాసన్ – మణిరత్నం కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కావడం విశేషం. గ్యాంగ్స్టర్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కమల్హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లుకు ప్రేక్షకుల్లో భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది.