Homemain slidesకమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద సీపీఐ నిరసన.. ఉద్రిక్తత

కమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద సీపీఐ నిరసన.. ఉద్రిక్తత

భారత్ సమాచార్.నెట్, హన్మకొండ: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని సీపీఐ కార్యదర్శి కర్రే భిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం కమలాపూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. పోలీసులు అక్కడ చేరుకుని వారికి సర్ధిచెప్పే క్రమంలో ఉద్రిక్తత నెలకుంది. కమలాపూర్ మండల కేంద్రంలో 320, గూడూరు గ్రామంలో 50, మర్రిపల్లిగూడెం గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండగా నిర్మించి ఏళ్ళు గడుస్తున్నా అధికారులు ప్రభుత్వం పంపిణీ చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. పేద ప్రజల సంక్షేమ ప్రగతి కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.

ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉందని, వెంటనే రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, ఇండ్లలో కరెంట్, ప్లంబింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అధికారులు స్పష్టత ఇచ్చి ఇళ్లను మంజూరు చేయకుంటే రోజు వారి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు నరిగే ఓదెలు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్, కొలుగూరి బాలరాజు, మహేందర్, జేరిపోతుల శిరీష, బొజ్జం లక్ష్మి, మహమ్మద్ షమీమా, బండారి రాధిక, జేరిపోతుల సునీత, రాణి, హారిక, సులుగూరి కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular