భారత్ సమాాచార్.నెట్: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు శ్రీరామ్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది చెన్నై కోర్టు. ఈ కేసులో ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనను చెన్నై కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జూలై 7 వరకూ ఆయన పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.
మాజీ అన్నాడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్ స్టేషన్కి తరలించి అనేక కోణాల్లో విచారించారు. శ్రీరామ్ మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి ఉపయోగించడాని విచారణలో పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. కిల్పాక్ మెడికల్ కాలేజీలో శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీరామ్ బ్లడ్ సాంపుల్స్ను పరీక్షించగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలినట్లు నార్కోటిక్ అధికారులు నిర్ధారించారు. ఇక ఈ కేసులో నటుడు శ్రీరామ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. కాగా తమిళంతో పాటు తెలుగు కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు శ్రీరామ్.