భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులు ఖరారు చేసింది. 2024-25 నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం పది వర్సిటీలకు కొత్త ఫీజులు ఖరారు అయినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
1. మోహన్బాబు యూనివర్సిటీ, వేలూరు వీఐటీ కి రూ.1.03లక్షలు,
2. ఎస్ఆర్ఎంకు 1.02 లక్షలు,
3. అపోలో వర్సిటీకి రూ.99500,
4. బెస్ట్ వర్సిటీకి రూ.69,500,
5. గోదావరి గ్లోబల్ వర్సిటీ, అన్నమాచార్య, ఆదిత్య, సెంచూరియన్ వర్సిటీలకు రూ.60 వేలుగా ఇంజనీరింగ్ ఫీజును నిర్ణయించింది.
6. కేఆర్ఈఏ వర్సిటీలో ఎంబీఏ కోర్సుకు రూ.97,500 ఫీజు ఖరారు చేశారు.( ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సు లేదు) ఈ యూనివర్సిటీల్లో ఇతర కోర్సులకు కూడా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. నాలుగు కొత్త క్యాంప్స్ లకు అనుమతులు మంజూరుచేస్తూ ఉన్నత విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీచేసింది. చిత్తూరులో కొత్త కాలేజీ విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుమతులు మంజూరు చేసింది.
మరికొన్ని తాజా వార్తా విశేషాలు…