Homemain slidesAnupama Parameswaran: యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేసినవారే అభిమానులయ్యారు: అనుపమ

Anupama Parameswaran: యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేసినవారే అభిమానులయ్యారు: అనుపమ

భారత్ సమాచార్.నెట్: మళయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran)కు యువతలో విశేషమైన ఫాలోయింగ్ (Following) ఉంది. ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలతో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌‌ను ప్రేమమ్ (Premam) అనే మలయాళ చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వతా అ ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆమె నటన, అందం, డ్యాన్స్‌ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ కరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న విమర్శలు, ట్రోలింగ్ గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆమె జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో ఎదర్కొన్న విమర్శలను గుర్తుచేసుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆమె మలయాళంలో తక్కువ చిత్రాలు చేయడంపై స్పందించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను ట్రోల్ చేశారని తెలిపారు. నాకటు యాక్టింగే రాదన్నారు. అలా ట్రోల్ చేస్తున్నప్పటికీ దర్శకుడు ప్రవీణ్ నాకు అవకాశం ఇచ్చారని.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రానికి నన్ను ఎంపిక చేశారని పేర్కొన్నారు.
విమర్శలు మొదట్లో చాలా బాధించాయని.. కానీ అవే విమర్శలు తనలో నమ్మకాన్ని పెంచాయని.. నటిగా ఎదగాలన్న కసిని పెంచాయని చెప్పుకొచ్చింది అనుపమ. కొవిడ్ సమంయలో కెరీర్ పరంగా జీవితంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అప్పటి నుంచి కథల ఎంపిక విషయంలో దృష్టి పెట్టాను. ఒకప్పుడు నన్ను ట్రోల్ చేసినవారే ఇప్పుడు నా అభిమానులయ్యారని అనుపమ తెలిపింది. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నానని.. నాకు మద్దుతు ఇచ్చినవారికి, ద్వేషించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు అనుపమ.
RELATED ARTICLES

Most Popular

Recent Comments