భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఏపీ ప్రభుత్వం (AP Govt) రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల అభివృద్ధి (Airport Development)పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టులో అవసరమైన అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు (Kurnool) విమానశ్రయంలో అవసరమైన పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.4.43 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అవసరమైన అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు విడుదల చేయగా.. రన్వే ఎండ్ సేఫ్టీ మెరుగుదలకు (ఆర్ఈఎస్ఏ) రూ.3.6 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే విమానాశ్రయ భద్రత కోసం కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణకు మిగిలిన రూ.83 లక్షలు వినియోగించనున్నారు. మరోవైపు కర్నూలు విమానాశ్రయ అభివృద్ధిపై చర్చించేందుకు.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని కలిశారు. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు సానుకూలంగా స్పందించారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. త్వరలో సర్వీసులు ప్రారంభించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. సాధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలిన చేస్తున్నారని తెలిపారు. అలాగే ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కాగా, కర్నూలు ఎయిర్పోర్టుకి నిధులు మంజూరు చేయడంపై టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికివిమానాశ్రయానికి నిధులు మంజూరు చేయడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.