Homebreaking updates newsదుబాయ్‌లో ఏపీ వాసికి భారీ జాక్‌పాట్

దుబాయ్‌లో ఏపీ వాసికి భారీ జాక్‌పాట్

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

బతుకు తెరువు కోసం దుబాయ్ చేరిన ఆంధ్రప్రదేశ్ వాసికి అ‌ద‌ృష్టం వరించింది. దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ఏపీకి చెందిన ఓ వ్యక్తికి భారీ జాక్‌పాట్ తగిలిందని అక్కడి మీడియా సంస్థ తాజాగా పేర్కొంది. 2019 నుంచి అక్కడి నేషనల్ బాండ్లలో తన డబ్బును పొదుపు చేస్తున్న బోరుగడ్డ నాగేంద్రం (46) దాదాపు రూ.2.25 కోట్ల నగదును గెలుచుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మెరుగైన జీవనోపాధి కోసం నాగేంద్రం 2017లో యూఏఈకి వెళ్లారు. 2019 నుంచి ఆయన సుమారు 2,271 ప్రతి నెలా అక్కడి బాండ్లలో పొదుపు చేస్తున్నారు. ట్యాక్స్ లు పోగా మిగిలిన సొమ్ము ఆయన బ్యాంకు అకౌంట్లో జమ అవ్వనుంది. తాను పొదుపు చేసిన నేషనల్ బాండ్లలో జాక్ పాట్ లభించటంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరికొన్ని ప్రత్యేక విశేషాలు…

కరోనా ఎఫెక్ట్… మనిషి ఆయుష్షు కూడా తగ్గుతోంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments