భారత్ సమాచార్.నెట్: విమానాల్లో బాంబు బెదిరింపులు (Bomb Threats), సాంకేతిక సమస్యలు (Technical issues), ప్రమాదాలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash Incident) అనంతరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అనేకం. తాజాగా ఇండిగో (Indigo) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాని నాగ్పూర్కు మళ్లించారు.
విమానాన్ని నాగ్పూర్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ ప్రయాణికులందరినీ కిందకు దింపి.. భద్రతా సిబ్బంది తనిఖీలు చేసింది. బాంబ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు, సోమవారం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ నగరం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విమానాన్ని మళ్లీ ఫ్రాంక్ఫర్ట్కి తిరిగి పంపించారు. ప్రయాణికుల రక్షణకు అన్ని తగిన చర్యలు తీసుకున్నారు.