Homemain slidesBCCI: బాంబే హైకోర్టులో బీసీసీఐకి ఎదురుదెబ్బ

BCCI: బాంబే హైకోర్టులో బీసీసీఐకి ఎదురుదెబ్బ

భారత్ సమాచార్.నెట్: బాంబే హైకోర్టు (Bombay Highcourt)లో బీసీసీఐ (BCCI)కి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంఛైజీ కోచి టస్కర్స్‌ యాజమాన్యానికి రూ.538 కోట్లు చెల్లించాలని బొంబాయి హైకోర్టు బీసీసీఐకి స్పష్టం చేసింది. ఈ తీర్పులో గతంలో ట్రైబ్యునల్‌ కోచి టస్కర్స్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ వివాదం చాలా ఏళ్లుగా నడుస్తుండగా.. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొచ్చి ఫ్రాంచైజీకి పెద్ద ఊరట లభించినట్లయింది.
ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీసీసీఐ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. కోచి టస్కర్స్‌ జట్టు 2011లో జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో మాత్రమే పోటీలకు హాజరైంది. అయితే, నిర్ణీత గడువు లోపు బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. 2011 సెప్టెంబర్‌లో బీసీసీఐ ఈ ఫ్రాంఛైజీని తొలగించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై వివాదం కొనసాగుతూనే ఉంది.
బీసీసీ నిర్ణయంపై 2012లో కోచి టస్కర్స్‌ యాజమాన్యం ఆర్బిట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. 2015లో ట్రైబ్యునల్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసీపీఎల్ (కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 384 కోట్లు, రెండెన్‌జ్వౌస్ స్పోర్ట్స్‌కు రూ. 153 కోట్లు, మొత్తంగా సుమారు రూ. 550 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాలు చేయగా తాజా తీర్పునిచ్చింది.
RELATED ARTICLES

Most Popular