భారత్ సమాచార్.నెట్: మహారాష్ట్ర (Maharastra)లోని పూణే (Pune)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూణే సమీపంలోని కుండమాలా (Kunda Mala )లో ఉన్న ఇంద్రాయణి (Indrayani) నదిపై నిర్మించిన వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది (Bridge Collapse). ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారికోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కుండమాలా.. పర్యాటక ప్రాంతం కావడంతో ఆదివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. అయితే రెండు రోజుల పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు బ్రిడ్జి పైకి రావడంతో.. దానిపై ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా వంతెన కూలడంతో బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు.
గత కొన్ని రోజులుగా పూణే ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరగింది. దీంతో ఆ నీటి కళను చూసేందుకు పెద్ద ఎత్తున్న సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఇంద్రాయణి నీటి మట్టం మరియు ప్రవాహం గణనీయంగా పెరగడంతో.. ఇది సహాయక చర్యలకు సవాలుగా మారింది.