Homemain slides'బీఆర్ఎస్ మొసలి కన్నీరు సరికాదు'

‘బీఆర్ఎస్ మొసలి కన్నీరు సరికాదు’

భారత్ సమాచార్, హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం ప్రజలు అందరికీ తెలుసని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో కూడా అందరికి తెలుసని చెప్పారు.

బీఆర్ఎస్ మొసలి కన్నీరు:
గత బీఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎల్పీ విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత గులాబీ పార్టీదని విరుచుకు పడ్డారు. అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే  ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరని అన్నారు. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. యాదగిరి గుట్టలో ముఖ్యమంత్రి పక్కన నల్గొండ జిల్లా మంత్రులను కూర్చోబెట్టారని.. భద్రాచలంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కూర్చోబెట్టారని ఆయన మీడియా ముందు వివరించారు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

నిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం

RELATED ARTICLES

Most Popular

Recent Comments