Homebreaking updates newsHimachal: ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు

Himachal: ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు

భారత్ సమాాచార్.నెట్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా.. ఉన్న 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరు మరణించగా.. గాయాలైన వారిని నెర్చోక్ మెడికల్ కాలేజీకి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కాగా గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారులపైకి భారీగా వరదనీరు, బురద చేరుతోంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగానే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments