భారత్ సమాచార్.నెట్: కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) దేశంలోని అన్ని రాష్ట్రాల (All States)కు కీలక సూచనలు చేసింది. దేశ వ్యతిరేక ప్రచారంపై (Anti-national propaganda) నిఘా (Surveillance) ఉంచాలని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాల (Pakistan Terror Camps)పై భారత సైన్యం (Indian Army) “ఆపరేషన్ సింధూర్” (Operation Sindoor) పేరిట మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది అని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి.
ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పాకిస్థాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచరాలు వ్యాప్తి చేస్తోంది. ఈ ప్రచారాన్ని భారత్ కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. అలాగే ఆపరేషన్ సింధూర్ సంబంధించి, భారత్ భద్రతపై తప్పుడు కథనాలు ప్రచారం చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్ వ్యతిరేకంగా ప్రచారం జరిగితే.. సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని పేర్కొంది.
అదేవిధంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వాలు, భద్రతా దళాలు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలను పెంచాలని కూడా చెప్పింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా.. 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించింది. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్నది కూడా కేంద్రం స్పష్టం చేసింది.