Homebreaking updates newsCorona Virus: భారత్‌లో కరోనా ఉధృతి.. 7వేల చేరువలో యాక్టివ్ కేసులు

Corona Virus: భారత్‌లో కరోనా ఉధృతి.. 7వేల చేరువలో యాక్టివ్ కేసులు

భారత్ సమాచార్.నెట్: దేశంలో మరోసారి కరోనా వైరస్ (Corona Virus) వ్యాపిస్తోంది. గత నెల రోజుల నుంచి దేశంలో కొత్త కేసులు (New Cases) నమోదవుతున్నాయి. సింగ్‌పూర్, హాంకాంగ్‌ల తర్వాత భారత్‌లోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. కోవిడ్ 19 (Covid-19) మళ్లీ విజృంభిస్తుండటంతో.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,000 కి చేరువలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు అంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 మందికి కరోనా నిర్దారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6, 491కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలో కేసులు నమోదు అవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది.

తాజా గణాంకాల ప్రకారం.. కేరళలో మొత్తం 1,957 పాజిటివ్ కేసులు ఉండగా, గుజరాత్‌లో 980, బెంగాల్‌లో 747, ఢిల్లీలో 728, మహారాష్ట్రలో 607 కేసులు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 42 కేసులు నమోదు కాగా.. అక్కడి యాక్టివ్ కేసుల సంఖ్య 728కి చేరాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోను కరోనా పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 86 యాక్టివ్ కేసులు ఉండగా, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

దేశంలో కేసులు పెరుగుతుండటంతో, అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య సదుపాయాల సమీక్ష కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అలాగే అత్యవసర వైద్య సదుపాయాల లభ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తేలికపాటి లక్షణాలు ఉన్నా వైద్య సలహా తీసుకోవాలని, నిబంధనలను పాటిస్తూ అపోహలు లేకుండా వ్యవహరించాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.

 

RELATED ARTICLES

Most Popular