భారత్ సమాచార్, క్రీడలు : భారత దిగ్గజ టెస్టు క్రికెట్ ఆటగాళ్లు పూజారే, రహానే ఇకపై వద్దంటే వద్దు..అని, వారి ఏజ్ అయిపోతోందని వారిలో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టేశారు. టీమిండియా ఫ్యూచర్ దృష్ట్యా ఇలా చేశామని బీసీసీఐ బోర్డు, సెలక్టర్లు ఇటీవల ప్రకటించారు. వెటరన్ ప్లేయర్ల ప్లేసులో యువకులు నిండిపోవడంతో ఫ్యాన్స్ కూడా వారిని, వారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ని మర్చిపోయి మురిసిపోయారు. సీన్ కట్ చేస్తే యువరక్తం కాస్త కొద్ది సిరీస్ లకే తేలిపోయింది. ఆడాలన్నా కసి, గెలవాలన్న సంకల్పం గిల్, శ్రేయస్ లో అస్సలు కనిపించలేదు అని క్రీడాభిమానులు భారీ విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. మరో సచిన్, మరో కోహ్లీ అంటూ క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే ఐపీఎల్ లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడి గిల్ యూత్ లో భారీ హైప్ తెచ్చుకున్నాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ కు బిల్డప్ ఎక్కువ ఆట తక్కువ అన్నట్టు తయారయ్యాడు అని అభిమానులు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అతనెంటో అతడి ఆట ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయినా ఈ ఇద్దరినే ఆడిస్తోంది బీసీసీఐ.
వీరిద్దరి స్కోర్ చూస్తే వారి ఆట ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. శ్రేయస్ లాస్ట్ 11 ఇన్నింగ్స్ ల్లో 4,12,0,26,0,31,0,4,31,0..ఇలా ఉంది. ఆఫ్రిదికి తమ్ముడిలా ఆడుతున్నాడు. నాలుగు గుండుసున్నాలు ఉన్నాయి. ఒక్క హాఫ్ సెంచరీ లేదు. ఇక అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే అసలు ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనిపించదు. అవుటైతే కనీసం బాధ కూడా ఉండదు.
ఇక శుభమన్ గిల్ చివరి 11 ఇన్నింగ్స్ లను చూస్తే..13,18,6,10,29,2,26,10,36,23,0..ఇలా ఉన్నాయి. వన్డేలు, ట్వంటీల్లో బాగానే ఆడుతున్నా గిల్ టెస్టుల్లో మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్నా, ఇలా ఆడడంపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఇన నిన్నటి టెస్ట్ పరాజయంలో ఈ ఇద్దరిదే కీలకపాత్ర. దీంతో వీళ్లను ఎందుకు సెలక్ట్ చేశారు ద్రావిడ్ సార్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.