భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం నేరాలతో అమాయకుల నుంచి దోచుకుంటున్నారు.సైబర్ నేరగాళ్లు ఓ మహిళను టార్గెట్ చేసి. భారీగా డబ్బును దండుకున్నారు. ఆన్లైన్లో పార్ట్టైం ఉద్యోగం పేరుతో మహిళకు వల విసిరారు. వారి మాటలు నమ్మిన ఆమె రూ.31.60 లక్షలు నష్టపోయింది.
ఉద్యోగం పేరిట భారీ మోసం:
మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ వివాహిత మొబైల్ కు ఆన్లైన్లో పార్ట్టైం ఉద్యోగం ఉన్నట్లు గత అక్టోబరులో మెసెజ్ వచ్చింది. దీంతో ఆమె అందులో ఉన్న నంబరును సంప్రదించింది. ఉద్యోగం పొందేందుకు, ఉద్యోగ ధ్రువీకరణకు కొంతమొత్తం డిపాజిట్ చేయాలని చెప్పడంతో మహిళ వారి ఖాతాలకు పలు దఫాలుగా నగదు పంపించింది.ఇదే అదునుగా భావించిన నేరస్తులు మరో ప్లాన్ ను రచించారు.. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పేరిట నకిలీ ఖాతా చూపి.. ఆమె ఖాతాలో ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నట్లు నమ్మించారు.. ఆ సొమ్ము తీసుకోవాలంటే 30 శాతం పన్ను చెల్లించాలని చెప్పారు.. దీంతో సైబర్ నేరస్థుల మాటలను నమ్మిన ఆ మహిళ వారు సూచించిన ఖాతాలోకి పలు దఫాలుగా రూ.31,60,900 పంపించింది ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ అక్టోబరు 21న రామగుండంలో సైబర్ క్రైం పోలీసులను సంప్రదించించినట్లు రామగుండం సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
నిందితుడికి రిమాండ్:
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు హైదరాబాద్లోని మహమ్మద్ అవాద్ అనే వ్యక్తి ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. తన పేరిట కొందరు మూడు బ్యాంకు ఖాతాలు తెరిచారని, డ్రా చేసి ఇస్తే రూ.లక్షకు రూ.300 కమీషన్ ఇస్తానని చెప్పడంతో ఒప్పుకున్నట్లు మహమ్మద్ అవాద్ పోలీసులకు తెలిపాడు. గృహిణికి సంబంధించిన మొత్తం సొమ్మును సైబర్ నేరస్థులు అవాద్ ఖాతాల నుంచి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహమ్మద్ అవాద్ను సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని వార్తలు: