భారత్ సమాచార్.నెట్: కోలివుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈకేసులో హీరో శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళంతో పాటు తెలుగు కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ ఇటీవల హరికథ అనే వెబ్సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోజూపూలు సినిమాతో తెలుగు, తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. పలు చిత్రాలతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.
ఏఐడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు కూడా నిర్వహించి రక్తనమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్కు శ్రీరామ్ను తరలించారు.
ఇక ఇప్పటికే ఈ కేసులో అన్నాడీఎంకే కార్యనిర్వాకుడు ప్రసాద్తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో శ్రీరామ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చెన్నై సినీ పరిశ్రమంలో శ్రీరామ్ అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. కాగా శ్రీరామ్ హీరోగా నటించిన ఎర్రచీర విడుదలకు సిద్ధమైంది.