భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: వంట గ్యాస్ లీక్ అవడంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకులకు తీవ్రగాయాలైన ఘటన ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెకంటి శంకరమ్మ అనే మహిళ తన ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. గమనించిన ఆమె కుమారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇద్దరూ తీవ్రగాయాలతో వంట గది నుంచి బయటకు వచ్చారు. స్థానికులు వారిని గమనించి అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు ఆస్పత్రికి వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మరిన్ని కథనాలు