Homebreaking updates newsGST: జీఎస్టీ రికార్డుల్లో ఆల్‌టైమ్ రికార్డు

GST: జీఎస్టీ రికార్డుల్లో ఆల్‌టైమ్ రికార్డు

భారత్ సమాచార్.నెట్: భారత ఆర్థిక చరిత్రలో సరికొత్త రికార్డు (Record) నమోదైంది. 2025 ఏప్రిల్‌ (April)లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఊహకు అందని విధంగా ఏకంగా రూ. 2.37 లక్షల కోట్ల జీఎస్టీ (GST).. ఖజానాకు చేరింది. గేతడాది ఏప్రిల్ నెలలో ఈ మొత్తంగా రూ.210 లక్షల కోట్లుగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన ఏడాదిగా 2025 నిలిచింది.
గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం పెరగడం విశేషం. అంతకుముందు నెల అయిన మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల నుంచి రూ.1.9 లక్షల కోట్లు సమకూరాయి. ఇది గతఏడాది ఇదే కాలానికి పోలిస్తే 10.7 శాతం పెరిగింది. ఇక దిగుమతులపై విధించే జీఎస్టీ వలన వచ్చిన ఆదాయం కూడా 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరుకుంది.
మరోవైపు, రూ.27,341 కోట్ల విలువైన రిఫండ్‌లు జారీ చేసిన తరువాత, నికరంగా లెక్కించిన జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే జీఎస్టీ వసూళ్లు అమల్లోకి వచ్చిన తొలి నెలలో రూ.92 వేల కోట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో జీఎస్టీ కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2018 ఏప్రిల్ నెలలో తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఆ తర్వాత కరోనా కారణంగా జీఎస్టీ వసూళ్లు నెమ్మదించాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్ నెలలో మళ్లీ లక్ష కోట్లు దాటగా.. అప్పటి నుంచి లక్ష కోట్ల మార్కు పైనే నమోదవుతూనే ఉన్నాయి..
RELATED ARTICLES

Most Popular

Recent Comments