Homebreaking updates newsఎన్ని గుండెల్రా మీకు ?... మాజీ సీఎం కేసీఆర్

ఎన్ని గుండెల్రా మీకు ?… మాజీ సీఎం కేసీఆర్

భారత్ సమాచార్, రాజకీయం ; అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అనారోగ్యం పాలైన గులాబీ అధినేత కేసీఆర్ తిరిగి కోలుకొని మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. ‘ఛలో నల్గోండ’ అంటూ భారీ ఎన్నికల ప్రచార సభను నేడు నిర్వహించారు. మాజీ సీఎంగా తొలి సారి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రత్యర్థుల పై, అధికార కాంగ్రెస్ పార్టీ పై ఘూటు విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల కోసం గులాబీ బాస్ చేస్తున్న మరో ఎలక్షన్ స్టంట్ అని ప్రత్యర్థులు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత తన వ్యహాలను పదును పెడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పై సర్వేలతో పాటుగా, పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.

ఛలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలోని – ముఖ్యాంశాలు

ఛలో నల్గొండ రాజకీయ సభ కాదు.. ఉద్యమ పోరాట సభ.

మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక.

బీఆర్ఎస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత కరెంటు తెచ్చినం. మన గవర్నమెంట్ వచ్చిన ఎడాదిన్నర నుంచి 24 గంటల కరెంటు ఇచ్చినం

ఇప్పుడే కరెంటు ఇట్లా ఉంటే..మార్చి, ఏప్రిల్ లో ఎట్లా ఉంటదో?

ఆనాడు జల సాధన ఉద్యమంలో ‘పక్కన కృష్ణమ్మ ఉంటే ఫలితమేమీ లేకపాయె’ అనే పాట రాసిన.

కొత్త గవర్నమెంటు వస్తే గత గవర్నమెంటు కంటే మంచి పనులు చేయాలె..కానీ దుర్మార్గమైన భాష మాట్లాడుతూ పాలిస్తున్నారు.

రైతులను పట్టుకొని చెప్పుతీసుకొని కొడతామంటారా? ఎంత కండ కావరం మీకు..

రైతులకు కూడా చెప్పులుంటయ్.. వాళ్లు కొడితే మూడు పండ్లు రాలుతయ్..

చివరి శ్వాస వరకూ పులిలాగా కొట్లాడుతా తప్ప.. పిల్లిలాగా ఉండను

రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా.. ఎన్ని గుండెల్రా మీకు ?

మరికొన్ని రాజకీయ కథనాలు…

అన్నదాతల కోసం కేసీఆర్ పొలం బాట

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments