Homemain slidesమానవ పిత్తులు.. యుగాంతానికి ఓ కారణమట

మానవ పిత్తులు.. యుగాంతానికి ఓ కారణమట

భారత్ సమాచార్, అంతర్జాతీయం : భూమి వేడుక్కుతోంది బాబోయ్..కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని సైంటిస్టులు ఎప్పుడూ వాపోతుంటారు. కాప్ సదస్సులు లాంటివి ఏర్పాటు చేసి జనాలు, పాలకుల్లో అవగాహన కూడా పెంచుతుంటారు. భూమి వేడెక్కడానికి, ఉద్గారాలు పెరగడానికి సంపన్న దేశాలే కారణమని.. పేద దేశాలు ఆరోపిస్తుంటాయి. సంపన్న దేశాలే వీటికి బాధ్యత వహించాలని.. ఉద్గారాలను తగ్గించుకోవాలని సూచిస్తుంటాయి. అయితే సంపన్న దేశాలు మాత్రం.. పేద, మధ్యాదాయ దేశాలతోనే భూమి వేడుక్కుతోందని.. వరి పంట బాగా వేయడం శిలాజ ఇంధనాలు అధికంగా వాడడం, బొగ్గుగనులు, థర్మల్ ప్లాంట్లను పేద దేశాలే విరివిగా ఉపయోగిస్తున్నాయని, అందుకే వాతావరణం మారిపోతుందని కౌంటర్ ఇస్తుంటాయి. అయితే వీరి గొడవ ఎలా ఉన్నా మన పిత్తులు(అపాన వాయువు) కూడా వాతావరణ మార్పులకు కారణమవుతోందని తాజాగా అధ్యయనంలో తేలింది. అదెంటో చూద్దాం..

మానవులు విడుదల చేసే అపాన వాయువు(పిత్తులు) ఈ భూమికి ప్రమాదకరంగా మారుతోందని సదరు అధ్యయనం చెబుతోంది. 200 ఏండ్ల తర్వాత ఈ భూమి నివసించేందుకు అనుకూలంగా ఉండదని ఆ స్టడీ పేర్కొంటోంది. రాబోయే 200 ఏండ్లలో భూమి భరించలేని విధంగా మారుతుందని, నివసించడానికి వీలుగా ఉండదని, అందుకు అనేక కారణాల్లో మన పిత్తులు కూడా ఓ కారణమని అంటున్నారు. మనుషులు ఎక్కువగా మీథేన్, నైట్రస్ అక్సైడ్ వాయువులను, పిత్తులు, త్రేన్పుల రూపంలో రిలీజ్ చేస్తున్నారని, ఇవి భూతాపాన్ని పెంచుతున్నాయని బ్రిటన్ కు చెందిన యూకే సెంటర్ ఫర్ ఎకోలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన డాక్టర్ నికోలస్ కోవాన్ సారథ్యంలోని ఓ అధ్యయనం తెలిపింది.

మీథేన్ వాయువుతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కారణాలతో భూతాపం పెరుగుతోంది. ఫలితంగా సముద్రాలు త్వరగా ఆవిరవుతున్నాయి. నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్లి దుప్పటిలాగా పరుచుకుంటోంది. దీని వల్ల భూమిపై వేడి.. వాతావరణంలో కలవడం లేదు. క్రమంగా ఈ వేడి పెరిగిపోతూనే ఉంది అని స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జెనివాకు చెందిన గిల్లామ్ చావెరట్ తెలిపారు. అలా భూమి వేడుక్కుతున్న కొద్దీ.. సముద్రాల్లో నీరు మాయమైపోతునే ఉంటుందని, కొన్నేళ్లలో సముద్రాలు పూర్తిగా ఆవిరి అవుతాయని, ఉష్ణోగ్రతలు కొన్ని వందల డిగ్రీలు పెరుగుతాయని గిల్లామ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా వచ్చే 200ఏండ్లలో భూమి కూడా.. శుక్ర గ్రహం లాగా మారి, మానవులు జీవించేందుకు అనుకూలంగా ఉండదని చెబుతున్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

వింత ఆచారం.. తల్లి, కూతురికి ఒక్కడే భర్త

RELATED ARTICLES

Most Popular

Recent Comments