Homebreaking updates newsHyderabad: అందాల పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్

Hyderabad: అందాల పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్

భారత్ సమాచార్.నెట్: మిస్‌ వరల్డ్‌ (Miss World) 2025 పోటీలకు హైదరాబాద్ (Hyderabad) ముస్తాబు కానుంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ (Hitex) వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నగారాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాదర్ మున్సిపల్ కార్పేషన్ (GHMC) భారీ సన్నాహలు చేస్తోంది. హైటెక్ సిటీ సరిసర ప్రాంతాలతో పాటు చార్మినార్, ట్యాంక్ బాండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాలు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే ప్రపంచ సుందరి కిరీటం ఆకారంలో నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏర్పాట్ల కోసం సుమారు 1.79 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారి పక్కన 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మిస్ వరల్డ్ అనే బోల్డ్ అక్షరాలతో స్వాగత బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 20 దేశాల జెండాలను ప్రదర్శించనున్నారు.
ఇదిలా ఉంటే నగరంలోని ప్రధాన ప్రాంతాలైన చార్మినార్, గచ్చిబౌలి, ఏఏంబీ మాల్, రాయదుర్గం, శిల్పారామం, బయోడైవర్సిటీ పార్కుల్లో విద్యుదీపాల అలంకరణతో రూపు రేఖలు మారనున్నాయి. ఈ ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు, స్వాగత ఆర్చులు, డాంగ్లర్స్, బంటింగ్స్, ఎల్‌ఈడీ కిరీటం, ఫెయిర్ క్వీన్ వంటి అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు మిస్ వరల్డ్ ఏర్పాట్లుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. దేశ విదేశాల నుంచి రానున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే విమానాశ్రయాలు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments