Homebreaking updates newsHyderabad: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

Hyderabad: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మే 6 నుంచి జూన్ 2 వరకు జరిగే ఈ పోటీల్లో 120కి పైగా దేశాల అందాల భామలు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

పోటీ నిర్వహణ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పోటీదారులు హైదారబాద్‌కు వస్తున్నారు. వారికి స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ఇప్పటికే ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అందాల భామలకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సౌకర్యాలు,  ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచానికి పరిచయం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మే 6-7: 120 దేశాలకు పైగా పోటీదారులు హైదరాబాద్ చేరుకుంటారు.
మే 10:  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా  మిస్ వరల్డ్ ప్రారంభోత్సవ వేడుక  జరగనుంది.  తెలంగాణ సాంప్రదాయ జానపద గిరిజన నృత్య ప్రదర్శనలతో ప్రపంచ అందగత్తెలు స్వాగతం పలకనున్నారు.
మే 12 :  మిస్ వరల్డ్ పోటీదారులు  నాగార్జున సాగర్‌, బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
మే 13 –  చార్మినార్, లాడ్ బజార్‌లో కల్చరల్ వాక్. తర్వాత చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్.
మే 14 –  వరంగల్‌లోని కాళోజీ కళా క్షేత్రంలోని  విద్యార్థులు,  సంఘాలతో మిస్ వరల్డ్ పోటీదారులు సమయం గడపనున్నారు.  ఆ  తరువాత రామప్ప ఆలయం పర్యటన చేస్తారు.
మే 15 –   యాదగిరిగుట్ట ఆలయ పర్యటన, ఆ  తర్వాత ప్రపంచ దేశాలకు చేనేత పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి పోచంపల్లి సందర్శనను షెడ్యూల్ చేశారు.
మే 16 – AIG, యశోదా, అపోలో హాస్పిటళ్లకు కంటెస్టెంట్ల  మెడికల్ టూర్.
మే 17 – గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్స్ జరుగనుంది.  ఆ  తర్వాత తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు. దీంతో పాటు  ప్రపంచ సుందరులు  ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్ సందర్శించనున్నారు.
మే 18&19: తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ టూర్. ఆ తర్వాత ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం సందర్శన.
మే 20-21: గ్రూప్ 1 కంటెస్టెంట్లు ఉప్పల్లో జరగబోయే ఏపీఎల్ చూడనుండగా.. గ్రూప్ 2 కంటెస్టెంట్లు శిల్పారామంలో ఆర్ట్ వర్క్‌షాప్ సందర్శించనున్నారు.
మే 22-24:  కంటెస్టెంట్ల  ప్రతిభా ప్రదర్శన, హెడ్ టూ హెడ్  చాలెంజ్, ఫ్యాషన్ ఫినాలే
మే 26: బ్రిటిష్ రెసిడెన్సీ & తాజ్ ఫలక్‌నుమాలో గాలా డిన్నర్. సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
మే 31:  హైటెక్స్ లో  సెంటర్ లో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అండ్   మిస్ వరల్డ్ కిరీటం అందజేత
జూన్ 2:  తెలంగాణ ఏర్పాటు దినోత్సవ సందర్భంగా మిస్ వరల్డ్ విజేతలు  గవర్నర్, సీఎంను రాజ్ భావన్ లో కలుస్తారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments