July 28, 2025 11:49 am

Email : bharathsamachar123@gmail.com

BS

నెక్ట్స్ లెవల్లో బీఎస్ఎన్ఎల్ టెక్నాలజీ

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే న్యూస్ ఇది. అతి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి సిమ్ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం రానుంది. ‘డైరెక్ట్ టు డివైజ్’ (డీటుడీ) అనే సాంకేతికతను భారతదేశంలో బీఎస్ఎన్ఎల్ మొట్టమొదటిగా తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్‌తో కలిసి సరికొత్త సేవలు అందుబాటులోకి తేనుంది. మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ చేయచ్చు. విజయవంతంగా ట్రయల్స్ కూడా నిర్వహించారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని టెలికాం వర్గాలు అంటున్నాయి.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు, స్మార్ట్ వాచ్‌తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. డైరెక్ట్ టు డివైజ్, సాంకేతికతతో సిమ్‌కార్డు లేకుండానే మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కార్ల యజమానులు కూడా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. యూజర్లకు ఇది గొప్ప కవరేజీ ఇవ్వడంతోపాటు నమ్మకమైన కమ్యూనికేషన్ అందిస్తుంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలా అన్నమాట. ట్రయల్స్‌లో భాగంగా 36 వేల కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని ఉపయోగించి దిగ్విజయంగా ఫోన్ కాల్ చేయడం జరిగింది.

మరికొన్ని వార్తా విశేషాలు...

సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఎలా చేయాలంటే…

Share This Post
error: Content is protected !!