భారత్ సమాచార్, హైదరాబాద్ ;
రచయిత స్వర్ణ కిలారి రాసిన ‘మేక బతుకు’ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరణ చేశారు. స్వయంగా నేను దుబాయ్ వెళ్ళానని అక్కడ ఉన్న లేబర్ క్యాంపులో కార్మికుల కష్టాలను చూశానని కేటీఆర్ అన్నారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా.. చూసినా గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి అన్నారు. వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం.. అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెక్కడైనా జరుగుతుందన్నారు. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చానని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. వారిని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసి.. సంవత్సరాల తర్వాత చివరికి ఇండియాకి తీసుకురాగలిగామన్నారు.
గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్కి జరుగుతున్న ఆడవాళ్ళ ఆక్రమ రవాణాపైన చర్చించారు. ఆ దిశగా దాని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఒకనాడు దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగిన పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా అనేక రంగాల్లో రాష్ట్రాలు నుంచి తెలంగాణకు వలస వస్తున్నారన్నారు. ప్రస్తుతం సమాజంలో చదివే అలవాటు బాగా తగ్గుతూ వస్తుందన్నారు. ఇలాంటి సమయంలోను అన్విక్షకి సంస్థ ఈ పుస్తకాన్ని తీసుకురావడం హర్షనీయం అన్నారు. సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా పుస్తక ప్రచురణలతో పాటు డిజిటల్ మాధ్యమల ద్వారా, ఆడియో పుస్తకాల ద్వారా ఈ దిశగా మరింత ప్రయత్నం జరగాలని కోరారు.