భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో (Main Role) రూపొందిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). అయితే ఈ చిత్రం విడుదల (Movie Release)కు ముందే వివాదంలో (Controversy) పడిన సంగతి తెలిసిందే. సినిమాలో కొన్ని సన్నివేశాలు (Some Scenes) బ్రాహ్మణుల్ని (Brahmins) కించపరిచేలా (Derogatory) ఉన్నాయని ఆరోపిస్తూ.. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు (Brahmana Chaitanya Vedhika President సిరిపురపు వెంకట శ్రీధర్ (Siripurapu Venkata Sridhar) ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ (Petition) దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సినిమాను విడుదలకు అనుమతించకుండా ఆపివేయాలని కోరిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇదే సమయంలో, ఈ వివాదానికి సంబంధించి పలువురికి నోటీసులు జారీ చేసింది. వీరిలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీఈఓ, CBFC ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్, నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి.వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరి ఉన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 1కి వాయిదా వేసింది. అలాగే సినిమా విడుదల అనంతరం ఇందులో అభ్యంతరకర కంటెంట్ ఏమైనా ఉంటే, వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో కన్నప్ప మూవీకి ఊరట లభించినట్లైంది. ఇకపోతే ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మంచు విష్ణు తన సొంత బ్యానర్ అవ ఎంటర్టెన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే.