Homemain slidesఅనిల్‌ అంబానీకి లీగల్ నోటీసులు...

అనిల్‌ అంబానీకి లీగల్ నోటీసులు…

భారత్ సమాచార్, జాతీయం ;

అంబానీ అనే పేరు గుర్తుకు రాగానే దాదాపుగా అందరికి ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ నే గుర్తుకు వస్తారు. తండ్రి ధీరు భాయ్ అంబానీ నుంచి బిజినెస్ లో, ఆస్తిలో సమాన వాటా తీసుకున్నారు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. కానీ ముఖేష్ మాత్రం తండ్రికి మించిన తనయుడిగా ఎదిగారు. పెద్ద కొడుకు అనిల్ మాత్రం తండ్రికి పేరుకి తలవంపులు తెచ్చే స్థాయికి దిగజారారు. ఇప్పటికే చాలా మంది అనిల్ అంబానీ పేరునే మర్చిపోయారంటే అది అతిశయోక్తి కాదు. తాజాగా అంబానీకి చెందిన కంపెనీ నుంచి భారీ మొత్తంలో చెల్లించాలంటూ లీగల్ నోటీసులు అందటంతో మరోసారి అనిల్ అంబానీ పేరు వార్తలో నిలిచింది.

కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీకి తుది నోటీసు అందిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వారికి 15 రోజుల సమయం మాత్రమే ఉంది. DMRC రిలయన్స్ ఇన్‌ఫ్రా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి నోటీసు పంపింది. ఇందులో ఎస్‌బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు +2% చొప్పున వడ్డీతో సహా రూ.2,599 కోట్ల వాపసు అడిగారు. దీని చెల్లింపు 15 రోజుల్లోగా జరగాలి. చెల్లించకపోతే, DMRC కోర్టు ధిక్కారానికి అనిల్ అంబానీ DAMEPL పై చట్టపరమైన చర్య తీసుకుంటుంది.

నోటీసు ప్రకారం, DMRC యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌కి వ్యతిరేకంగా ప్రాథమిక తీర్పు వెలువడినప్పుడు దాని ఎస్క్రో ఖాతాలో రూ. 2,599 కోట్లు జమ చేసింది. ఇప్పుడు DMRC ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అనిల్ అంబానీ కంపెనీకి 15 రోజుల గడువు ఇవ్వడం అనిల్ అంబానీకి పెద్ద టెన్షన్‌గా మారింది. ఇంతకు ముందు ఇదే తరహాలో పెద్ద మొత్తం చెల్లించాల్సి వస్తే తమ్ముడు ముఖేష్ అంబానీ చివరి నిమిషంలో సాయం చేశాడు. మరి ఇప్పుడు తమ్ముడే మళ్లీ ఆదుకుంటాడా లేక అనిల్ మరో ప్రత్యామ్నాయం ఏమైనా వెత్కుకుంటాడా అనేది తెలియాలంటే మరో 15 రోజులు ఎదురు చూడాలి.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్…

RELATED ARTICLES

Most Popular

Recent Comments