భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు (Miss World 2025) సర్వం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి జూన్ 2 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. తొలిసారిగా తెలంగాణలో జరుగుతున్న ఈ పోటీలను రేవంత్ సర్కార్ (Revanth Sarkar) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే కంటెస్టెంట్లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచే స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా స్వాగత ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్.
‘ఆల్ ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ’ (ALL EYES OF THE WORLD ARE ON TELANGANA) అనే నినాదంతో హైదరాబాద్లో ఈ వేడుక ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే 120 దేశాలకు చెంది అందాల భామలు పోటీల్లో పాల్గొనేందుకు నగారానికి వచ్చేశారు. అయితే ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అందాల భామ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. మిస్ వరల్డ్ కిరీటం కోసం భారత్ తరఫున 21 ఏళ్ల నంది గుప్తా పాల్గొంటోంది.
రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా.. 2023, ఏప్రిల్ 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 పోటీల్లో విజేతగా నిలిచింది. అందం, అద్భుతమైన తెలివితేటలు, దృడమైన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచింది నందిని గుప్తా. ఈ నేపథ్యంలోనే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరుఫున ఎంపికైంది ఈ సుందరీ. ఇకపోతే ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ పోటీల్లో దాదాపు 120 దేశాల మోడల్స్ పాల్గొననున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయ్ కార్యక్రమంతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి.