Homebreaking updates newsPM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ 

PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ 

భారత్ సమాచార్.నెట్: అహ్మదాబాద్‌ (Ahmedabad) నుంచి లండన్‌ (London)కు బయలుదేరిన ఎయిరిండియా విమానం (Air India Plane) ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. విమానం ఎలా కూలిందన్న అంశంపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.
 అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి ప్రధాని మోదీ వెళ్లారు. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామార్శించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి కూలిపోయిన ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడిన వ్యక్తిని ప్రధాని మోదీ పరామర్శించారు. ఇక ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాని కూడా మరణించారు. విజయ్ రూపాని కుటుంబ సభ్యులను కైడా ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కే ఒక్క ప్రయాణికుడు మృత్యువును జయించాడు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments