భారత్ సమాచార్.నెట్: బాలీవుడ్ స్టార్ ఆమీర్ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. తాజాగా ఈ చిత్రాన్ని భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రాష్ట్రపతి చూశారు. ఈ చిత్రాన్ని రాష్ట్రపతితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, సిబ్బంది, చిత్రబృందం వీక్షించారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ రాష్ట్రపతిని కలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ ఆమీర్ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ మేరకు భారత్ రాష్ట్రపతి తమ చిత్రాన్ని వీక్షించారని హర్షం వ్యక్తం చేశారు. సినిమా పట్ల రాష్ట్రపతి చూపిన ఆదరణ, అందించిన ప్రశంసలు తమకు ఎంతో అమూల్యమైనవి అని పేర్కొంది. తమ టీమ్ అందరి తరఫున రాష్ట్రపతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్షణాలను తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని టీమ్ పేర్కొంది.
ఇకపోతే సితారే జమీన్ పర్ జూన్ 20 థియేటర్లలో విడుదలైంది. తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ టాక్తోనే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మానసికింగా సవాళల్లు ఎదుర్కొంటున్న బృందాన్నీ నేషనల్ ప్లేయర్స్గా ఎలా తీర్చిదిద్దారనే కథాంశంతో మూవీ రూపొందింది. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్ర పోషించగా.. అమీర్ఖాన్ కోచ్గా కనిపించి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు.