August 11, 2025 5:55 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Andhrapradesh: ఏపీకీ కేంద్రం గుడ్ న్యూస్.. కొత్తగా మూడు విమాన సర్వీసులు 

భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ (National), అంతర్జాతీయ (International) గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు (New Flight Services) అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి (Minister Civil Aviation of India) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తెలిపారు.

విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం – అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ ఫ్లైట్స్‌ వారానికి నాలుగు రోజులు నడవనున్నాయని వివరించారు. అలాగే విశాఖపట్నం – భువనేశ్వర్‌ మధ్య జూన్ 12 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

అలాగే విజయవాడ – బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతానికి ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరుకు అనుసంధానం కావొచ్చని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ మూడు రూట్లలో కొత్తగా ప్రారంభమయ్యే విమాన సర్వీసులు రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే కాకుండా.. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కూడా ప్రోత్సహించనున్నాయని ఆయన పేర్కొన్నారు.
Share This Post