Homebreaking updates newsహైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఛార్జీల తగ్గింపు!

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఛార్జీల తగ్గింపు!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ (Hyderabad-vijaywada) జాతీయ రహదారి (Highway)పై నిత్యం రద్దీ (Rush)గా ఉండే సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి. అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్ఏఐ (NHAI) శుభవార్తే చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములను (Toll Charges) తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ కొత్త రేట్లు అమలులో ఉండనున్నాయి.

 

 

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65)పై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు రూ. 15, రెండు వైపులా అయితే రూ. 30, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు రూ. 25, ఇరువైపులా అయితే రూ. 40, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి రూ. 50, ఇరువైపులా అయితే రూ. 75 వరకు టోల్ తగ్గించారు. ఏపీలోని చిల్లకల్లు (నందిగామ) టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు రూ. 5, ఇరువైపులా అయితే రూ. 10 చొప్పున మాత్రమే టోల్ తగ్గించారు. అలాగే, 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25శాతం మినహాయింపు ఇచ్చారు.
గతంలో ప్రతీ ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఛార్జీలు పెంచిన జీఎంఆర్ (GMR) సంస్థ.. 2024 జూన్ 31తో ఆ సంస్థ ఒప్పందం ముగిసిపోయింది. అయితే హైవే 65ను బీవోటీ పద్ధతిలో నిర్మించడంతో 2012 నుంచి డిసెంబర్ నుంచి టోల్ ధరలు వసూలు చేస్తుండగా.. ఒప్పందం ముగియడంతో ఆ బాధ్యతను ఏడాదిపాటు ఏజెన్సీలకు ఎన్‌హెచ్ఏఐకు అప్పగించింది. జీఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచేవారు. కానీ ఇప్పుడు ఎన్‌హెచ్ఏఐ టోల్ వసూలు చేయడంతో టోల్ ఛార్జీలు తగ్గించారు. ఇక టోల్ రేట్లు తగడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments