Homemain slides'15రోజులే గడువు.. సిద్ధంగా ఉండాలి'

’15రోజులే గడువు.. సిద్ధంగా ఉండాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం రైతులకు మరొ శుభవార్త తెలిపింది. రైతు భరోసా, సన్నాలకు బోనస్ డబ్బులు మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులే గడువుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments