Homebreaking updates newsPM Modi: సంతకమైనా తమిళంలో చేయండి.. డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు

PM Modi: సంతకమైనా తమిళంలో చేయండి.. డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు

భారత్ సమాచార్.నెట్, రామేశ్వరం: తమిళనాడు (Tamil Nadu)లోని డీఎంకే (DMK) ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రామేశ్వరం (Rameshwaram) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నేతల తీరు తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని.. వారు తనకు తరచూ లేఖలు (Letters) రాస్తుంటారని.. కానీ ఒక్కరు కూడా మాతృభాష తమిళంలో సంతకం చేయరని అన్నారు. తమిళ భాషను గౌవరించాలని అందరూ తమిళంలో సంతకాలు (Sign in Tamil) చేయాలని తమిళనాడు రాజకీయ నేతలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

 

చాలా రాష్ట్రాలు వైద్యవిద్యను మాతృభాషలో అందిస్తున్నాయని దీంతో ఇంగ్లీష్‌ చదవలేని పేద విద్యార్థులు సైతం మాతృభాషలో ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తున్నారని ప్రధాని తెలిపారు. మెడిసిన్ చదువాలనుకుంటున్న విద్యార్థులకు తమిళ భాషలో విద్య అందించాలని సూచించారు. తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నిధులు పెంచినప్పటికీ.. కొందరు డీఎంకే నాయకులు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామన్నారు. 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం యూపీఏ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600కోట్లు కేటాయించిందన్నారు.

 

రామేశ్వరం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పాంబన్ వంతెనను ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశానికే గర్వకారణంగా నిలిచే 3 బ్రిడ్జ్‌లను నిర్మించిందని పేర్కొ్న్నారు. ముంబైలో సముద్ర వంతెన, జమ్మూకశ్మీర్‌లో చినాబ్‌ వంతెన, రామేశ్వరంలో పాంబన్‌ వంతెనల గొప్పదనాన్ని వివరించారు. పాంబన్‌ వంతెన నిర్మాణంలో లెటెస్ట్ టెక్నాలజీ వాడమని అన్నారు. ప్రజలకు ట్రాన్స్‌పోర్ట్ పరంగానే కాకుండా ఉపాధి, ఆదాయవృద్ధికి కూడా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుందని చెప్పారు. భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాం పుట్టిన స్థలం అయిన రామేశ్వరం టెక్నాలజీ, ఆధ్యాత్మికత కలగలిసిన పుణ్యభూమిగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments